సిరాన్యూస్, ఆదిలాబాద్
జాతీయ క్రీడాకారులను అభినందించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా చించుఘాట్ ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికల) విద్యార్థులు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్బంగా విద్యార్థినిలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, గిరిజన సంక్షేమ శాఖ డీడీ దిలీప్కుమార్లు అభినందించారు. శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మడావి రూపా, పెందూర్ శ్రీజలను ఘనంగా సత్కరించారు. ఈసందర్బంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా వీరి క్రీడా నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో మడావి రూపాకు విలువిద్యకు సంబంధించిన పరికరాలను గుర్తు చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈనెల 23, 26వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్లొనేందుకు వెళ్తున్న రూపా, శ్రీజలకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. ఈకార్యక్రమంలో జిలాజిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, పీడీ రవీందర్, కోచ్ మారుతి పాల్గొన్నారు.