సిరాన్యూస్, ఇచ్చోడ
రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి: కలెక్టర్ రాజర్షి షా
* తెలంగాణా గ్రామీణ బ్యాంక్ సందర్శన
రైతులకు రుణ మాఫీ చేసిన నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా అన్నారు. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ లోని తెలంగాణా గ్రామీణ బ్యాంక్, జిల్లా కేంద్రం సహకార బ్యాంకు, లిమిటెడ్ బ్రాంచ్, ఎస్బిఐ బ్యాంక్, అడేగాం కే లను శుక్రవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫి చేసిన నేపథ్యంలో బ్యాంకుల్లో జరుగుతున్న ప్రాసెస్ ను, రైతుల లిస్ట్ ను పరిశీలించారు. బ్యాంకులకు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కువ మంది క్యూ కట్టకుండా తొందరగా ప్రాసెస్ పూర్తి చేసి వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని బ్యాంక్ మేనేజర్ లను ఆదేశించారు.అనంతరం ఇచ్చోడ మండలం ఆడేగాం కె శివారు లో 18 ఎకరాలలో సర్వే నెంబర్.46 లో సమీకృత పాఠశాలల భవనాల నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలించి , వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఆర్ ఓ తుకారాం, ఎంఈఓ ఉదయ్, డీటీ రామారావు, సర్వేయర్ బాపురావు, గిరిధవర్ హుసేన్, బ్యాంక్ మేనేజర్ లు, తదితరులు పాల్గొన్నారు.