Collector Rajarshi Shah: నాణ్యమైన విద్య అందించాలి: జిల్లా క‌లెక్ట‌ర్‌ రాజర్షి షా

సిరాన్యూస్, అదిలాబాద్
నాణ్యమైన విద్య అందించాలి: జిల్లా క‌లెక్ట‌ర్‌ రాజర్షి షా
విద్యార్ధులకు మంచి అలవాట్లు నేర్పించాలి
* విద్యార్థుల గదులు శుభ్రంగా ఉంచుకోవాలి
* ప్రభుత్వ కొలాం ఆశ్రమ పాఠశాల త‌నిఖీ

విద్యార్థుల‌కు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. మంగ‌ళ‌వారం అదిలాబాద్ పట్టణం లోని ప్రభుత్వ కొలాం ఆశ్రమ పాఠశాల (బాలురు) ను జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంత‌రం విద్యార్ధుల అభ్యసన సామర్థ్యం, సిక్ రూమ్, వంటగది, విద్యార్ధుల గదులను పరిశీలించారు.ఈ సందర్భంగా ముందుగా రిజిష్టర్ లను పరిశీలించి, హాజరు ఏరోజుకారోజు వేయాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు.సిక్ రూమ్ లో ఉన్న విద్యార్ధుల ఆరోగ్యం పై ఆరా తీసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పరిశుభ్రత పాటించాలని ఆన్నారు.విద్యార్థుల గదులు, సిక్ రూమ్ శుభ్రంగా లేకపోవడం తో అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల అవరణ లో చెత్త చెదరం పేరుకుపోయి ఉండడం తో మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి వెంటనే శుభ్రం చేయించాలని ఆదేశించారు . వంట గదిని పరిశీలిస్తూ సరుకులు, వండే విధానాన్ని గమనించారు.అన్ని గదులను పరిశీలిస్తూ పదవ తరగతి విద్యార్ధులతో ముచ్చటిస్తూ బాగా చదువుకోవాలని, పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు ఇప్పటి నుండే బాగా చదవాలని, ఏ సబ్జెక్టులో నైన వెనుకబడి ఉంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఏమైన సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగగా ఫ్యాన్ లు లేవని తెలపగా ఆ ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారాయణ రావు, ఉపాద్యాయులు, తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *