Collector Rajarshi Shah: ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా

సిరాన్యూస్‌, సిరికొండ
ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా
* తిమ్మాపూర్‌లో పిండిగిర్ని, ఆయిల్ మిల్‌ను ప్రారంభం

గ్రామీణ మహిళల ఆర్ధికాభివృద్ధికి, కుటుంబ పురోగతికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం తిమ్మాపూర్లో గ్రామస్తులు సాంప్రదాయ బద్దంగా మంగళహారతులతో , మేళతాళాలతో క‌లెక్ట‌ర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.గిరిజన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, పిండిగిర్ని, ఆయిల్ మిల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పల్లి నూనె తీసే విధానాన్ని పరిశీలించి, పల్లి నూనె తో పాటు పలు రకాల నూనెలను పరిశీలించి, గ్రామస్తులతో మట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ను అందరూ సద్వినియోగం చేసుకొని లబ్దిపొందాలని ఆన్నారు. యూనిట్ విలువ 2,30,000 కాగా ఎంపీఎఫ్ఎంఈ సబ్సిడీ 80,500 తిమ్మాపూర్ లోని కొట్నాక్ లక్ష్మి బ్యాంక్ ద్వారా ఋణం 1,49, 000 పొంది పిండి గిర్ని, ఆయిల్ మిల్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరా మహిళా శక్తి ద్వారా 15 రకాల సహకారాలను అందిస్తుందని ఎంటర్ ప్రైసెస్, వ్యక్తిగత రుణాలు, షాపులను పెట్టేందుకు మహిళా సంఘాల ద్వారా రుణాలు పొంది ఉపాధి పొందాలని సూచించారు. సిరికొండ మండలం లో 219 యూనిట్లు కాగా 6 యూనిట్లను గుర్తించడం జరిగిందని ఆన్నారు.దీనితో పాటు వాతావరణానికి తగ్గట్టు మేలు జాతి గేదెలు, బర్రెలు తీసుకొని పాల ఉత్పత్తులు ద్వారా లబ్ధి పొందవచ్చునని తెలిపారు. దీనికి కమిటి వేయడం జరిగిందని కమిటీ లో మహిళా సంఘాల అధ్యక్షులు, ఏపీఎం, వెటర్నరీ డాక్టర్, ఎంపిడిఒ లు ఉంటారని ఆన్నారు. పౌల్ట్రి, ఇంటర్, డిగ్రీ చదివి మధ్యలో ఆపేసినవారు ఖాళీగా ఉన్నవారికి పీఎంజీవై కింద 10 లక్షల నుండి 20 లక్షల వరకు ఋణం పొందే అవకాశం ఉందని, ఈ రుణాలు సకాలం లో కడితే మళ్లీ తీసుకునేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు.రెండవ విడత యూనిఫాం త్వరగా పూర్తి చేయాలని, మొదటి విడత నిధులు రెండు, మూడు రోజుల్లో ఇవ్వడం జరుగుతుందని అన్నారు.తదుపరి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఏర్పాటు చేసిన దాల్ మిల్ ను జిల్లా పాలనాధికారి పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం సిరికొండ మండల సమైఖ్య సర్వసభ్య సమావేశంలో పాల్గొని సిరికొండలో 19 జీపీ లు ఉన్నాయని, ఈ సంఘాల ద్వార వంద శాతం అచివ్ మెంట్ జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ సాయన్న, ఎంఆర్ఓ ఉపేంద్ర, ఎంపిడిఓ రమేశ్, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *