Collector Rajarshi Shah: అనాథ పిల్ల‌ల‌కు సంర‌క్ష‌ణ క‌ల్పించాలి : క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరాన్యూస్‌, ఇంద్రవెల్లి
అనాథ పిల్ల‌ల‌కు సంర‌క్ష‌ణ క‌ల్పించాలి : క‌లెక్ట‌ర్ రాజర్షి షా

అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అందునాయక్ తాండా లో ఇటీవలే తల్లిని కోల్పోయిన ఇద్దరు కవల పిల్లలతో పాటు ఇద్దరు బాలికలకు పూర్తి సంరక్షణ కల్పించ వలసిందిగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిని ఆదేశించారు.ఈ సందర్భంగా సోమవారం అందునాయక తాండాలో ఉన్న కవల పిల్లలకు పాలు, పాల డబ్బాలు, బట్టలు, కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకులు అందించారు. శిశు గృహ ద్వారా పిల్లలకు సంరక్షణ కల్పిస్తామని ఆన్నారు.ఇందులో బాలసదనం  సిబ్బంది ప్రేమ్, అనిల్ కుమార్, వైష్ణవి, అంగన్వాడి టీచర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *