సిరాన్యూస్, నేరడిగొండ
వంటగదుల్లో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్ రాజర్షి షా
* మధ్యాహ్న భోజన పథకం లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
* నేరడిగొండ జడ్పీఎస్ఎస్ పాఠశాల తనిఖీ
పాఠశాల వంటగదుల్లో పరిశుభ్రత పాటించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కోర్టికల్ (బి) మండల ప్రాథమిక పాఠశాల, నేరడిగొండ జడ్పీఎస్ఎస్ స్కూల్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా నేరడిగొండ లోని జడ్పీఎస్ఎస్ స్కూల్ లో విద్యార్ధులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించి, రుచికరమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని ఆన్నారు. సరుకులు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, తదితర తడి లేకుండా శుభ్రమైన చోట భద్రపరచాలని, వర్షాకాలం లో జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. విద్యాబోధన విద్యార్ధుల ప్రగతి పై దృష్టి కేంద్రీకరించి ప్రతీ నెల మూడవ శనివారం పిటిఎం కార్యక్రమాన్ని నిర్వహించాలని, పేరెంట్స్ , టీచర్ సమావేశాలలో విద్యార్ధుల విద్యా మానసిక సామర్థ్యాలను పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయాలని , పరిసరాలు, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కోరిటికల్ బి , నేరడిగొండ ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వార చేపడుతున్న నిర్మాణ పనులను పరిశీలించి, బోర్, త్రి ఫేస్ విద్యుత్ కనెక్షన్, టాయిలెట్స్ , పాఠశాల గదులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. విద్యార్ధులకు ఏకరూప దుస్తులు అందించారు. విద్యార్ధుల మెజర్మెంట్ ( కొలతల) ప్రకారం యూనిఫాం కుట్టాలని, ఈ సందర్భంగా కొరిటికల్ బి మండల ప్రాథమిక పాఠశాల లో ఏకరూప దుస్తుల పంపిణీలో కొలతల ప్రకారం యూనిఫాం కుట్టనందున అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలు అనిత ని విద్యార్దులకు ఏం బోధిస్తున్నారు, పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారా, తదితర వివరాలు అడిగి తెలుసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించడం జరిగిందని, ఎక్కువ సంఖ్యలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చెర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వందశాతం అడ్మిషన్లు జరగాలని తెలిపారు . అలాగే పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలి తెలిపారు. విద్యార్ధులతో మట్లాడుతూ మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది, కోడి గ్రుడ్లు వారానికి ఎన్నిసార్లు ఇస్తున్నారు, టీచర్లు పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, పద్మా , ఎంఆర్ ఓ సంతోష్ రెడ్డి, ఆర్ అండ్ బి అధికారి, అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మెన్, సీడీపీఓ, ఎంపీఓ, తదితరులు పాల్గొన్నారు.