సిరాన్యూస్, ఖానాపూర్
రుణమాఫీ పై అపోహాలు వద్దు : కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్
అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదే అని, తప్పుదోవ పట్టించే ప్రతి పక్షాల మాటలను నమ్మవద్దు అని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు పదేళ్ల కాలంలో లక్ష వరకు రైతు రుణమాఫీ కూడా చేయలేకపోయారన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే సుమారు 18 వేల కోట్లు 22 లక్షల మంది రైతులకు ఖాతాలో వేశామని తెలిపారు. అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించి, అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.