Debate on the story of cars – Rachcha కార్ల కహానీపై చర్చ- రచ్చ

సిరా న్యూస్,హైదరాబాద్;
సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ పకడ్బందీగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అత్యంత అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చుతారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ లో 22 వాహనాలు ఉండేవి.అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అదే అధికారం కోల్పోతే గతంలో చేసినవన్నీ తిరగబడతాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ నుంచి గతంలో అధికారంలో ఉన్న గులాబీ రాష్ట్ర సమితికి ఇటువంటి పద ఘట్టనలే ఎదురవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ మీద.. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంత మేరకు బొక్క పడింది అనేది కాంగ్రెస్ పార్టీ లెక్కలతో సహా వివరించింది. ఏకంగా శ్వేత పత్రాలను విడుదల చేసింది. దీనికి కౌంటర్ గా భారత రాష్ట్ర సమితి శ్వేత పత్రాలు విడుదల చేసింది. ఈ సంగతి అటు ఉంచితే బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా కెసిఆర్ కార్ల కహాని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా అటు మీడియాలోనూ.. ఇటు ప్రజల్లోనూ చర్చ మొదలైంది.సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ పకడ్బందీగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అత్యంత అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చుతారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ లో 22 వాహనాలు ఉండేవి. అవి కూడా అత్యంత అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. అయితే ఇందులో కొన్ని వాహనాలను భారత రాష్ట్ర సమితిలోని కొంతమంది నాయకులు వాడేవారు. ముఖ్యమంత్రి బాధ్యత దృష్ట్యా వాహనాలను ఎప్పటికప్పుడు ఆధునికరిస్తారు. అయితే ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ల్యాండ్ క్రూయిజ్ షోరూం కు భారీ ఆర్డర్ ఇచ్చింది. 22 వాహనాలు కావాలని, వాటికి బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం ఉండాలని చెప్పింది. ఈ ఆదేశాల వెనుక కేసీఆర్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. మూడోసారి కూడా తనే అధికారంలోకి వస్తానని భావించిన కేసీఆర్.. తన వాహన శ్రేణి అత్యంత ఆధునికంగా ఉండాలని ఈ ఆర్డర్ అధికారుల ద్వారా ఇప్పించినట్టు సమాచారం. అయితే ఒక్కొక్క వాహనానికి మూడు కోట్లు చొప్పున 66 కోట్లు ప్రభుత్వం ఆ కంపెనీకి చెల్లించింది. అధికారంలోకి రాగానే విజయవాడ నుంచి ఆ వాహనశ్రేణి తెలంగాణకు రప్పించి దానిని వినియోగించాలని కెసిఆర్ అనుకున్నారు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది. అధికారంలోకి రావాలి, హ్యాట్రిక్ కొట్టాలి అనుకున్న కేసీఆర్ కలలు నెరవేరలేదు.అయితే కేసీఆర్ కుటుంబ దోపిడీ గురించి వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పనిలో పనిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్డర్ ఇచ్చిన ల్యాండ్ క్రూయిజ్ స్టోరీ విలేకరులకు వివరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *