సిరా న్యూస్,మహేశ్వరం;
రంగారెడ్డి జిల్లా -మహేశ్వరం నియోజకవర్గ మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సంతు సేవాలాల్ బంజారా సంఘం కోసం గతంలో ప్రభుత్వం భూమిని కేటాయించడం జరిగింది. బంజారా సంఘం నాయకులు అక్కడ చుట్టూ బౌండరి నిర్మించుకున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించి పూజ కార్యక్రమం కొనసాగించారు.తాజాగా మంగళవారం నాడు రెవెన్యూ అధికారులు వచ్చి చుట్టూ ఉన్న కంపాడు వాల్ ను కూల్చి వేసారు. అధికారులను బంజారా సంఘం నాయకులు అడ్డుకున్నారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.