సిరాన్యూస్, జైనథ్
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ సుచల
* సుందర గిరిలో ఉచిత వైద్య శిబిరం
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సుచల అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సుందరగిరి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గిమ్మ డాక్టర్ సుచల ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్బంగా గ్రామం లోని గర్భిణులు, బాలింతలు, పిల్లలు, రోగులకు వైద్య పరీక్షలు జరిపి మందులు అందించారు. అవసరమైన వారి రక్త నమూనాలను సేకరించి రిమ్స్ కు వైద్య పరీక్షల కోసం తరలించారు. ఈసందర్బంగా డాక్టర్ మాట్లాడుతూ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషక ఆహారం గురించి ఆరా తీశారు. తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఓ సూపర్వైజర్ అనిత, ఏఎన్ఎం అడేల్ల,ఆశా కార్యకర్త వాగు బాయి పాల్గొన్నారు.