సిరాన్యూస్,జైనథ్
ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్: డీఎస్పీ జీవన్రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బహదూర్ పూర్ గ్రామంలో (ఆనంద్ పూర్) వినాయక మండపం పక్కన పేకాట పేకాటాడుతున్న ఐదుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారి నుంచి రూ. 10,030 నగుదు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జీవన్రెడ్డి వివరాలు వెల్లడించారు.జైనథ్ మండలం బహదూర్ పూర్ గ్రామంలో (అనంద్ పూర్) వినాయక మండపం పక్కన పేకాట ఆడుతున్నారన్న విశ్వాసనీయ సమాచారం ప్రకారం జైనథ్ ఎస్సై వి.పురుషోత్తం తన సిబ్బందితో కలిసి దాడి చేసి చంద్రకాంత్, శ్రీనివాస్, షబ్బీర్, మొయినుద్దీన్, రెహమాన్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 52 పేక ముక్కల,నగదు 10030 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.వినాయక మండపాల్లో ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడవద్దని, జైనథ్ మండలంలో ఎక్కడా కూడా పేకాట, మట్కా, గంజాయి, గుట్కా వంటి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలం లో ఎక్కడైన మట్కా, గుట్కా, పేకాట, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతుంటే జైనథ్ సీఐ నెంబర్ 8712659916, ఎస్సై నెంబర్ 8712659916లకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. అనంతరం ,డీఎస్పీ జీవన్రెడ్డి, సి.ఐ సాయినాథ్లు ఎస్సైలతో పాటు సిబ్బంది శ్రీనివాస్, కైలాష్లను అభినందించారు.