EX cricketer Venkatapathy Raju:దేవాలయాలను దర్శించుకున్న మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు దంపతులు

సిరాన్యూస్‌, ఓదెల
దేవాలయాలను దర్శించుకున్న మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు దంపతులు

పెద్దపల్లి జిల్లా మంథనిలో ప‌లు దేవాల‌యాల‌ను ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్ వెంకటపతి రాజు సోమవారం ద‌ర్శించుకున్నారు. ఈసంద‌ర్భంగా గంగా నది తీరంలో గల శ్రీ గౌతమేశ్వర ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ బాల సరస్వతి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తమ్మి చెరువు కట్ట వీధిలో పశ్చిమ ముఖ ద్వారంలో వెలసిన శ్రీ బిక్షేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఆలయ నిర్వాహకులు వెంకటపతి రాజు దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *