సిరా న్యూస్, ఆదిలాబాద్:
తుది శ్వాస వరకు ప్రజలతోనే…
+ మాజీ మంత్రి జోగు రామన్న
+ ఖాప్రిలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
ప్రజల ఆశీర్వాదంతో ఒక సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తాను, చివరి శ్వాస వరకు ప్రజలతోనే ఉంటానని మాజీ మంత్రి జోగు రామన్న వ్యాఖ్యానించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఖాప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, జై తెలంగాణ… జై బీఆర్ఎస్ నినాదాలు చేసారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు జోగు రామన్నను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తాని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, తన తుది శ్వాస వరకు ప్రజల మద్యనే ఉంటూ, ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికి అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, నాయకులు సర్సన్ లింగారెడ్డి, పులివేణి గణేష్ యాదవ్, మెట్టు ప్రహ్లాద్, రాంరెడ్డి, బొల్లి గంగన్న, రామన్న, తదితరులు పాల్గొన్నారు.