సిరాన్యూస్,జైనథ్
ఆర్థిక ఇబ్బందులతో రైతు బుర్రి వెంకన్న ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మేడిగూడ-ఆర్ చోటు చేసుకుంది. ఎస్సై పురుషోత్తం వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బుర్రి వెంకన్న(59) వ్యవసాయం సాగు చేస్తున్నాడు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలు సరిగ్గా పండక ఆర్థిక ఇబ్బందుల పాలయ్యాడు. దీంతో మనస్తాపం చెంది రైతు వెంకన్న సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కొడుకు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.