యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

సిరా న్యూస్,లక్నో;
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం పద్దెనిమిది మంది ప్రయాణికులు స్పాట్‌లోనే మృతి చెందారు. డబుల్ డెక్కర్ బస్సు పాల కంటైనర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్‌ మొత్తం కంటైనర్‌లోకి దూసుకెళ్లడంతో ఘోరం జరిగిపోయింది. లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడ్డారు.బీహార్‌లోని సీతామర్హి నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి మిల్క్‌ కంటైనర్‌ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బస్సులో ఇరుకున్న వారిని బయటకు తీశారు. బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *