సిరా న్యూస్,రాచకొండ;
రాజమండ్రి నుంచి ఉత్తర్ ప్రదేశ్ కి గంజాయి తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాని ఎస్ఓటి ఎల్బీనగర్ సహాయంతో అరెస్ట్ చేసిన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. నిందితుల వద్ద నుంచి కోటి రూపాయలు విలువజేసే 360కేజీల గంజాయి, ఒక కార్ ను పోలీసులు సీజ్ చేసారు. రాజమండ్రి నుండి ఉత్తరప్రదేశ్ కు కారులో గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు రాచకొండ సి పి సుధీర్ బాబు తెలిపారు