ఆర్ఎంసి లో 66వ వార్షిక దినోత్సవం
సిరా న్యూస్,కాకినాడ;
విద్యార్ధులు ఇష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు సాధిస్తారని రాష్ట్ర డి.ఎం.ఇ., ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటి వి.సి. , కాకినాడ రంగ రాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా॥నరసింహ్మం పేర్కోన్నారు.
కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో కళాశాల 66వ వార్షిక దినోత్సవాన్ని నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ డా,, ఎ. విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథు లుగా డీ.ఎం.ఈ.తో పాటు కాకినాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా,, లావణ్యకుమారి, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా,, హేమలతాదేవి, విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డా,, బి. దేవీమాధవి, స్నేహ ఆసుపత్రి ఎండీ డా,, కె.రామ స్వరూప్ జవహర్ హాజరయ్యారు. తొలుత వైస్ ప్రిన్సిపల్ డా. ఎ. విష్ణువర్ధన్ కళాశాల వార్షిక నివేదిక వివరించారు.2023-24 బ్యాచ్కు చెందిన విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు, , బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు. కళాశాల విద్యార్థులకు, వైద్య నిపుణులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. బ్యాచ్ విజేతలుగా అనిరుద్, పార్వతిలకు పతకాలు, అందజేశారు.
డీఎంఈ మాట్లాడుతూ కళాశాల హౌస్ సర్జన్లు డా,, ఎ. సాయి అనిరుధ్, డా,, పార్వతి బ్యాచ్ విజేతలుగా నిలిచారన్నారు. సాయి అనిరుధ్ 9, పార్వతి 7 బంగారు పతకాలు సాధించారన్నారు. కళాశాల బయట ఏర్పాటు చేసిన ఫొటోఫ్రేమ్లో విద్యార్థులు స్వీయచిత్రాలు. తీసుకుని సందడి చేశారు. బంగారు పతకాలు, ధ్రువపత్రాలు సాధించిన విద్యార్థులు, తల్లిదం డ్రులు కలిసి అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో ఫోరెన్సిక్ హెచ్ వోడీ ఉమామహేశ్వర రావు, జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. కె.శైలజ, వైద్యనిపుణులు తదితరులు పాల్గొ న్నారు. విద్యార్థుల సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.