సిరా న్యూస్, ఇచ్చోడ:
ఇచ్చోడ ఏఎంసీలో అధికారుల ఇష్టారాజ్యం…
+ కొరవడిన సమయపాలన
+ తరుచుగా విధులకు డుమ్మా
+ ఇబ్బందులు పడుతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. మార్కెట్ కార్యాలయంలో మొత్తం 9 మంది సిబ్బంది ఉండగా, పలువురు తరుచుగా డుమ్మాలు కొడుతూ.. విధులకు ఎగనామం పెడుతున్నారు. దీంతో మార్కెట్ కార్యాలయానికి వచ్చే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే మార్కెట్ కమిటీ అధికారులకు నెల నెల జీతాలు తీసుకోవడంలో ఉన్న శ్రద్ద, విధులపై లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సిరా న్యూస్ స్పెషల్ స్టొరీ…
రైతు దినోత్సవం నాడు ఒక్కరే…
ఈ నెల 23న జాతీయ రైతు దినోత్సవం నిర్వహించేందుకు మార్కెట్కు వెళ్ళిన రైతులు, రైతు సంఘాల నాయకులకు చుక్కెదురైంది. ఆ రోజు 9 మంది సిబ్బందిలో కేవలంలో ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే విధుల్లో ఉండగా, ఏఎంసీ కార్యదర్శి లీవ్లో ఉన్నట్లు రైతులు తెలిపారు. మిగిలిన 7 గురు సిబ్బంది ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైనట్లు రైతులు చెబుతున్నారు. దీంతో మార్కెట్ కమిటీలో రైతు దినోత్సవం నిర్వహించకుండనే వారంత వెనుదిరిగారు. దీంతో అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కానరానీ సమయపాలన…
సీసీఐ ద్వార పత్తి కొనుగోళ్లు జరుగుతున్న దృష్ట్యా, సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నపటికీ వాటిని సైతం సిబ్బంది బేఖాతరు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఉన్నత అధికారుల అనుమతులు లేకుండా డుమ్మా కొట్టడం, విధులకు వచ్చిన కూడ సమయపాలన పాటించకపోవడంతో వివిద పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే రైతులు వెనుదిరిగిపోతున్నారని మండల వాసులు చెబుతున్నారు. విధుల డుమ్మా కొడుతూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
===================================
జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి…
జాతీయ రైతు దినోత్సవం రోజు కార్యాలయానికి డుమ్మా కొట్టిన ఇచ్చోడ మార్కెట్ కమిటీ అధికారులపై జిలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. ఆ రోజు కేవలం ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. కార్యదర్శి అధికారికంగా లీవ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన 7 గురు సిబ్బంది ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు ఎగనామం పెట్టారు. ఇక్కడ అధికారులు తరుచుగా విధులకు గైర్హాజరవ్వడమే కాకుండా, సమయపాలన కూడ పాటించడం లేదని రైతులు చెబుతున్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
–సంగెపు బొరెన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు.
===================================