ఇది ఘోర విపత్తు

ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం
వైఎస్ షర్మిలా రెడ్డి
ఏపీసీసీ చీఫ్
సిరా న్యూస్,ఇడుపులపాయ;
ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి. ⁠వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నది కేవలం 5 ఏళ్లు మాత్రమే. 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి మరిచిపోలేనిది. వైఎస్సార్ మరణం తర్వాత 700 మంది చనిపోయారు. వాళ్లందరికి కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుందని ఏపీసీసీ ఛీఫ్ షర్మిలా రెడ్డి అన్నారు. సోమవారం నాడు ఆమె ఇడుపులపాయలో వైఎస్సార్ కు నివాళలర్పించారు. షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయాలు ఒక్కటి అమలు కావడం లేదు. వైఎస్సార్ లాంటి పాలకులు మళ్లీ లేరు. అలాంటి పాలన మళ్లీ రాదు. వైఎస్సార్ హయాంలో సంక్షేమం,అభివృద్ధి సమానంగా జరిగింది. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు అయ్యింది. 10 ఏళ్లుగా అభివృద్ధి లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ప్రత్యేక హోదా రాలేదు. ⁠కడప స్టీల్ వైఎస్సార్ కల. వైఎస్సార్ మరణం తర్వాత జలయజ్ఞం అటకెక్కింది. అభివృద్ధిని బాబు,జగన్ నీరు గార్చారు. ⁠జగన్ కడప బిడ్డ అయ్యి ఉండి ఇక్కడ అభివృద్ధి లేదు. ⁠మహానాయకుడి ఆశయాలు ఒక్కటి అమలు కాలేదని అన్నారు.
బీజేపీ ని వైఎస్సార్ వ్యతిరేకించారు. జగన్ మాత్రం బీజేపీ తో దోస్తీ కట్టారు. రాష్ట్రంలో వరదలు ఒక అసాధారణ పరిణామం. ఇది ఘోర విపత్తు. ఈ విపత్తును ముందు అంచనా వేయలేక పోయారు. ప్రజలను అప్రమత్తం చేయలేక పోయారు. ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఎలా అంచనా వేయలేక పోయారు . చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం. ⁠కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *