రైతుల శ్రేయస్సుకు కలిసికట్టుగా పని చేద్దాం..!

సింగల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు

 సిరా న్యూస్,కమాన్ పూర్;

రైతుల శ్రేయస్సు కొరకు కలిసికట్టుగా పని చేద్దామని కమాన్ పూర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు అన్నారు.
కమాన్ పూర్ మండల కేంద్రంలోని పీ. ఏ. సీ. ఎస్ కార్యాలయంలో శుక్రవారం పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై సమీక్ష జరిపారు. అనంతరం పీ. ఏ. సీ. ఎస్ లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఇందులో 560 మంది రైతులకు రుణమాఫీ రూ, 3కోట్ల 95 లక్షల 45 వేల 81 లు జరిగిందన్నారు. అలాగే రుణమాఫీయైన 468 మంది రైతులకు రూ, 3 కోట్ల 62 లక్షల 71 వేల రూపాయలు రుణం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే కొత్తగా 103 మంది రైతులకు రూ, 80 లక్షల 59 వేల రుణం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే దీర్ఘకాలిక రుణాలు రూ, 51,40,000 ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే ఫెర్టిలైజర్ 5976 బస్తాలు యూరియా డి.ఎ.పి 17 లక్షల 805 అమ్మడం జరిగిందని స్పష్టం చేశారు. వేసంగిలో 1,39,820 క్వింటాల్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి తిమ్మరాజు సంతోష్ కుమార్, వైస్ చైర్మన్ చిందం తిరుపతి, డైరెక్టర్లు వైనాల రాజు, గుండేటి శ్రీ మూర్తి, వరాల నర్సింగం, ఊదరి నరేష్, అడవాల చంద్రయ్య, బానోతులక్ష్మి, సిబ్బంది రేగుల కుమార్, ఎస్ కే సాబీర్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *