ఉనికి కోసం ఆరాటం

సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఉందా? లేదా? అనే డౌట్‌కు చెక్‌ పెడుతూ స్ట్రాటెజీస్‌కు క్లాప్‌ కొట్టింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్యం ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక, తెలంగాణలో పవర్‌ చేజిక్కింది. అంతే వైట్‌ నాట్‌ ఏపీ? అంటూ రాహుల్‌ గాంధీ బెల్‌ మోగించారు. తెలంగాణ ఎన్నికల టైమ్‌ నుంచే ఆయన ఇప్పుడు ఏపీపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. రాహుల్‌ మాట రీసౌండ్‌ ఇవ్వడమే కాకుండా ఏపీ కాంగ్రెస్‌లో కదలిక కన్పించింది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు, బెజవాడలో పొలిటికల్‌ ఎఫైర్స్‌ మీటింగ్‌, ఇలా చాన్నాళ్ల తరువాత ఢిల్లీతో ఫోన్‌-ఇన్‌ల పర్వం మొదలైంది.రాహుల్‌ ఏపీపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో రీసెంట్‌ టైమ్‌లో యాక్టివిటీ పెరిగింది. అందుకు నిదర్శనంగా హైకమాండ్‌ నుంచి ఏపీ కాంగ్రెస్‌ నేతలకు లేటెస్ట్‌గ పిలుపు వచ్చింది. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో సమాలోచనలు జరుగనున్నాయి. ఏపీపై రాహుల్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారనదీ క్లియర్‌. మరి ఏపీ స్పెషల్‌ స్టేటస్‌ ప్రధాన అజెండాగా ఉండబోతుందా? కర్ణాటకలో ఐదు.. తెలంగాణలో ఆరు.. ఏపీలో ఎన్ని గ్యారెంటీలు ఉంటాయి..? అనేదీ ఆసక్తికరంగా మారింది.కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో రాహుల్‌ ప్రియాంక విస్తృతంగా పర్యటించారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇక ఏపీలో కూడా రాహుల్‌. ప్రియాంక పర్యటనలు ఉంటాయని ఏపీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు ఇప్పటికే చెప్పారు. రాహుల్‌ దిశా నిర్దేశంతో ఏపీ కాంగ్రెస్‌లో చాన్నాళ్ల తరువాత జోష్‌ కన్పిస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌… సెంట్రల్‌‌లో ఇండియా కూటమి గెలుపు ఖాయమనే ధీమా విన్పిస్తోందిలా. ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్‌ పెరొగచ్చిన ఉండవల్లి నుంచి పాజిటివ్‌ వైబ్స్‌ , కామ్రేడ్‌ నారాయణ పొత్తు రాగం తెరపైకి రానే వచ్చాయి.మొత్తానికి చాన్నాళ్ల తరువాత ఏపీ కాంగ్రెస్‌ చర్చల్లో తళుక్కుమంటోంది. జనవరి మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని ఢిల్లీ వేదికగా షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. అనంతరం ఎన్నికల సమయం నాటికి కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ టీడీపీ జనసేన కూటమి హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. గెలుపు విషయంలో ఎవరి ధీమాలో వాళ్లు ఉన్నారు. బీజేపీ ఉన్నప్పటికీ పోటీలో లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోకి షర్మిల వెళ్లడంతో ద్వారా పార్టీకి ఎంత వరకు మేలు జరుగుతుందనే చర్చనీయాంశం. తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. తమ ఓటు బ్యాంకు జగన్‌కు వెళ్లిపోయిందని గ్రహించిన హస్తం నేతలు ఇప్పుడు షర్మిలను చేర్చుకొని ఆ ఓటు బ్యాంకు తిరిగి పొందాలని భావిస్తున్నారు. అసలు తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే టాక్ వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జాయినింగ్‌ను వాయిదా వేశారు. షర్మిలను పార్టీలో చేర్చుకుంటే తెలంగాణలో వ్యతిరేకత వస్తుందని చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున ఆ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే అంశంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతోపాటు సోనియా, రాహుల్‌తో సమావేశాలు ముగిసినట్టు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ను జగన్ వీడటం, విభజన నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి చెందిన ప్రధానమైన ఓటు బ్యాంకు వేర్వేరు పార్టీల్లోకి వెళ్లిపోయింది. ప్రధానంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *