Mahaparinirvan in Pembi: పెంబిలో అంబేడ్కర్‌ వర్ధంతి…

సిరా న్యూస్, నిర్మల్‌(పెంబి):

పెంబిలో అంబేడ్కర్‌ వర్ధంతి…

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజక వర్గం పెంబి మండల కేంద్రంలో డా. బాబా సాహేబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బుధవారం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దేశానికి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చిన మహానీయుడు అంబేడ్కర్‌ అని అన్నారు. అంబేడ్కర్‌ అందరివాడు అని, ప్రతీ ఒక్కరు ఆయన చూపిన బాటలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోరే రమేష్, అందే రాజు, బోరే శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *