సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
తెలంగాణ నూతన ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం మావోయిస్టు ప్రభావిత ప్రాంతామైన మారుమూల ఆదివాసీ గ్రామం పులిగుండాలలో పోలీసుల పహారా మధ్యలో ఈ రోజు ప్రారంభమైనది..దీనికి మారుమూల ఆదివాసీ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దరఖాస్తులు అందచేశారు..ఈ కార్యక్రమానికి చర్ల సిఐ రాజగోపాల్ తమ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పులిగుండాల సెక్రటరీ తోకల సురేష్ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు