సిరా న్యూస్, సైదాపూర్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత : గ్రామశాఖ అధ్యక్షుడు మారుపాక తిరుపతి
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో రూ-/65000 విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు గ్రామశాఖ అధ్యక్షుడు మారుపాక తిరుపతి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చేలా కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రాజిరెడ్డి, తిరుపతి, అశోక్, ఐలయ్య, వెంకటయ్య, రవి, రమేష్, తిరుపతి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.