MBBS Prashamsa: ఎంబీబీఎస్ సీటు సాధించిన ప్రశంసకి ప్రశంశల వెల్లువ

సిరాన్యూస్‌, గుడిహత్నూర్
ఎంబీబీఎస్ సీటు సాధించిన ప్రశంసకి ప్రశంశల వెల్లువ
* గుడిహ‌త్నూర్‌లో శుభాకాంక్ష‌లు తెలుపుతూ ప్లెక్సీ ఏర్పాటు

1996 ఎస్ఎస్‌సీ బ్యాచ్ కి చెందిన డాక్ట‌ర్‌ బొర్రా లక్ష్మణ్ కూతురు నీట్‌ 2024 తెలంగాణ రాష్ట్ర బాలికల కేటగిరిలో ప్రముఖ ఏఐఐఎంఎస్ విజయవాడ లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సీటు సాధించిన శుభ సంద్బంగా బొర్రా ప్రశంస కు శుభాకాంక్షలు తెలుపుతూ గుడిహత్నూర్ బస్టాండ్ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారి మిత్రుడు పీఏసీఎస్ చైర్మన్ ముండే సంజీవ్ మాట్లాడుతూ తమ మిత్రుడు బొర్రా లక్ష్మణ్ కడు పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి తన పిల్లలను కూడా ఉన్నత చదువులు చదివించార‌న్నారు. వారిని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రోత్సహించడం మా అందరికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. ఈ సంద్భంగా వారి మిత్రులు రవి నాయక్, నీలకంఠ అప్ప, కిషన్ బుద్దె లు కూడా ప్రశంసకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *