MLA Anil Jadhav: గత ప్రభుత్వ హయంలోనే రోడ్లకు మహర్దశ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

సిరాన్యూస్‌, ఇచ్చోడ
గత ప్రభుత్వ హయంలోనే రోడ్లకు మహర్దశ : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
* బీటీ రోడ్డు, ప్రహరి గోడ నిర్మాణానికి భూమి పూజ

గత ప్రభుత్వ హయంలోనే రోడ్లకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గాంధీనగర్ నుంచి బోరిగామ మీదుగా కామగిరి వరకు రూ. 1.80 కోట్లతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. అలాగే బోరిగామ గ్రామంలోని జిల్లా పరిషత్ గోపిడి వెంకట్రాంరెడ్డి మెమోరియల్ పాఠశాలకు రూ 10 లక్షల నిధులతో చేపట్టిన ప్రహరి గోడ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయ‌న మాట్లాడారు. గత తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందని అన్నారు. గత సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి మారుమూల పల్లెకు కూడా రోడ్డు వసతి కల్పించారన్నారు.పనులను నాణ్యతగా చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాథోడ్ ప్రవీణ్, షేక్ సాబీర్, మాజీ ఎంపీటీసీ రమేష్ నరవాడ, శాంతాపూర్ మాజీ సర్పంచ్ తిరుమల్ గౌడ్, గోపిడి మహేందర్ రెడ్డి, గ్రామస్తులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *