సిరాన్యూస్,జైనథ్
డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి రూ.4.5 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
* తరోడ బ్రిడ్జి పరిశీలన
చాలా రోజుల నుంచి జైనథ్ మండలం తరోడ బ్రిడ్జి బేల, మహారాష్ట్ర కు వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం తరోడ బ్రిడ్జి సమీపంలో డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నాలుగున్నర కోట్లు నిధులు మంజూరు చేసిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు . శనివారం అధికారులతో ఇంజనీర్లతో కలిసి తరోడ బ్రిడ్జి సమీప పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వీలైతే రాత్రి పగలు కష్టపడి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా బ్రిడ్జి సమీపంలోని రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఆ తర్వాత డైవర్షన్ నిర్మాణం పనులను పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం లాండా సాంగ్వి, ఆడ, ఆర్లి అర్లీ మీదుగా వాహనాలు ప్రయాణించడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు. మరో ఆరు నెలల్లో ప్రస్తుతం కుంగిపోయిన బ్రిడ్జిని కూలగొట్టేసి కొత్త బ్రిడ్జ్ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ యకులు గజనన్, స్వామి రెడ్డి తదితరులు ఉన్నారు.