MLA Rajappa: ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల్గ‌కుండా చ‌ర్య‌లు : ఎమ్మెల్యే రాజప్ప

సిరాన్యూస్,సామర్లకోట
ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల్గ‌కుండా చ‌ర్య‌లు : ఎమ్మెల్యే రాజప్ప

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జ‌రుగుతుంద‌ని ఎమ్మెల్యే రాజప్ప, జిల్లా అధ్యక్షుడు బాబు అన్నారు. మంగ‌ళ‌వారం సామర్లకోట ఏలూరు కాలువకు ప‌డ్డ‌ గండిని ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చిన హఠాత్తు విపత్తుతో అనేకమంది ప్రజలు నష్టపోవడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అన్ని ముంపు ప్రాంతాలను పరిశీలించడం జరుగుతుందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుం దన్నారు. సామర్లకోటలో 780 హెక్టార్లు, పెద్దాపురం మండలంలో 842 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనాలు వేశారు.  ముప్పులో ఉన్న ప్రజలకు త్రాగునీరు, ఆహారం అందజేయడం జరుగుతుందని అన్నారు. ముంపు ప్రాంత ప్రజలందరికీ బియ్యం, నిత్యవసర వస్తువులు అందజేయాలని కలెక్టర్ ఆదేశించడం జరిగిందని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీడివో డి శ్రీలలిత, తెదేపా, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *