సిరాన్యూస్,ఖానాపూర్
కూలిపోయిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన నీరెటీ రాజవ్వ యొక్క నివాస గృహము భారీ వర్షాల కారణంగా కూలిపోయింది. శుక్రవారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారి వద్దకు వెళ్లి కూలిపోయిన ఇంటిని పరిశీలించి రాజవ్వను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సహాయాన్ని, ప్రజా పాలనలో వచ్చేటటువంటి నూతన గృహ నిర్మాణా సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, కౌన్సిలర్స్, నాయకులు, జన్నారపు శంకర్ ,అమానుల్లా ఖాన్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు.