సిరాన్యూస్, ఉట్నూర్
వినాయకునికి పూజలు చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దంపతులు
*భక్తులకు అన్నం వడ్డీంచిన ఎమ్మెల్యే దంపతులు
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట కొలువుదీరిన గణనాథుడికి ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ – ధ్రుపత కుటుంబ సమేతంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అయన సతీమణితో కలసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించి, భక్తులకు అన్నం వడ్డించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.సకల విగ్నాలను హరించే గణనాథుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని కోరారు.విశ్వంలోని సకల జీవ రాసులు ఆయురారోగ్యాలతో పాడిపంటలు బాగా పండాలని ఆ గణనాథుడిని ఎమ్మెల్యే దంపతులు వేడుకున్నారు.ఈ సందర్బంగా గణేష్ మండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,భక్తులు పాల్గొన్నారు.