సిరాన్యూస్, ఉట్నూర్
నైపుణ్య కోర్సులతో స్వయం ఉపాధి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఐటిఐ కళాశాలలో శిక్షణ పొందిన యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఖానాపూర్ నియోజవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని పిఏంఆర్సి భవనంలో ప్రధానమంత్రి విశ్వకర్మ తొలి వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఐటిఐలను అప్ గ్రేడ్ చేస్తుందని తెలిపారు.పదవ తరగతి చదివిన అనంతరం ఐటిఐ కళాశాలలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని,స్వయం ఉపాధితో పాటు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు.పిఎం విశ్వకర్మ పథకం చేతి,కుల వృత్తులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ,ఐటీడిఏ పిఓ, అదనపు కలెక్టర్ అధికారులతో కలసి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పొందిన చేతి వృత్తుల కళాకారులు తయారుచేసిన పనిముట్లు,గిరి వికాసం ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్,ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్,జిల్లా అధికార యంత్రాంగం, తదితరులు పాల్గొన్నారు.