సిరాన్యూస్, ఉట్నూర్
కొమురం భీం వర్ధంతిని విజయవంతం చేయండి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కొమురం భీం వర్ధంతి గోడ పత్రుల విడుదల
ఈనెల 17న ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని జోడెన్ ఘాట్లో నిర్వహించే అమరజీవి కుమ్రం భీం వర్ధంతిని విజయవంతం చేయాలని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో కుమ్రం భీం వర్ధంతికి సంబందించిన గోడ పత్రులను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జల్,జంగల్,జమిన్ నినాదంతో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమరం భీం అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కొమరం భీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.ఈ వర్ధంతి సభకు రాష్ట్ర నలుమూలల నుండి ఆదివాసీలు, మేధావులు,కార్మికులు,కర్షకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో కుమ్రం భీం మనవడు కుమ్రం సోనేరావ్,లక్కారం మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి,మంగీ మాజీ సర్పంచ్ కోట్నాక్ గణపతి, మాజీ సర్పంచ్ పెందుర్ కళావతి,కమిటీ సభ్యులు కుమ్రం మాధవ్,తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.