సిరాన్యూస్, ఖానాపూర్
ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కృషి: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కృషి చేస్తున్నామని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా
ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అధ్యక్షతన మున్సిపాలిటీ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణంలోని ఉద్యానవనం, మున్సిపాలిటీ పార్కులో ఏపుగా పెరిగినటువంటి మొక్కలను డిజైన్ గ్రాస్ కటింగ్ చేయించుట గురించి పార్కులో ఉన్నటువంటి ఓపెన్ జిమ్ పరికరాలను మరమ్మతులు చేయించుట గురించి చర్చించారు. సమావేశంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ కారింగుల సంకీర్తన సుమన్ , జన్నారపు విజయ లక్ష్మి శంకర్ , నాయిని స్రవంతి సంతోష్ ,పరిమి లత సురేష్ , కిషోర్ నాయక్, అబ్ధుల్ ఖలీల్ ,కుర్మా శ్రీనివాస్ , కో ఆప్షన్ సభ్యులు బండారి కిషోర్ , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.