భూ సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి:

సింగరేణి క్రింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం వారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సింగరేణి ఆర్జి1, ఆర్జి 2, ఆర్జి 3 పరిధిలో పెండింగ్ భూ సేకరణపై అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి సంబంధిత అధికారుల తో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ
సింగరేణి ఆర్జి 1,ఆర్జి 2, ఆర్జి 3 పరిధిలోని పెండింగ్ భూ సేకరణకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రామగిరి, మంథని, రామగుండం మండలాల్లోని భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు
ఆర్&ఆర్ ప్రక్రియ పూర్తి చేసిన బాధితులు ఇండ్ల ఖాళీ చేసేలా చూడాలని , అవసరమైన వారికి డిఫాల్ట్ నోటీసు జారీ చేయాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్య , మంథని ఆర్డీఓ హనుమా నాయక్, సింగరేణి, రెవెన్యూ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *