సిరా న్యూస్,కాళహస్తి;
శ్రీ వాయులింగేశ్వరస్వామి వెలసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం నందు దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారిని మహావిష్ణువు అలంకారంలో సర్వాంగ సుందరంగా అలంకరించి అలంకార మండపం నుండి అంజంజి గణపతి, బాల జ్ఞానాంబిక మహానంది సన్నిధానం తదుపరి ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు వద్ద తీసుకొని వచ్చి విశేష పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని జ్ఞాన ప్రసూనాంభ సమేత వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్.ఆర్.కృష్ణారెడ్డి ఏఈఓ లోకేష్ రెడ్డి సూపర్డెంట్ అండ్ సి.ఎస్.ఓ.నాగభూషణం యాదవ్, మరియు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.