సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామం లో కాలువ లో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మృతి చెందిన బాలురు తూరంగి గ్రామం ఉప్పరపేటకు చెందిన రెండవ తరగతి చదువుతున్న జక్కి అభిరామ్ వయసు (8 ), మూడవ తరగతి చదువుతున్న గండికోట దుర్గప్రసాద్ వయసు (10) గా గుర్తించారు.