సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
డిసెంబర్ 2 నుండి 8 వరకు మావోయిస్టు పి.ఎల్.జి. ఏ.వారోత్సవాలను గ్రామగ్రామాన విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల చర్యలను ప్రతిఘటించడం కోసం పోలీసు బలగాలు అడవిలోని అన్ని పల్లెలను జల్లెడ పడుతున్నాయి. అయినా మావోయిస్టులు తమ వారి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను బహిరంగంగా ఆదివాసీ గ్రామాలలో ఆదివాసీల మధ్య విజయవంతంగా నిర్వహించుకున్నారు. వారోత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వాటిని వీడియోలు చేసి మీడియా లో పోస్ట్ చేశారు.అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.