Pawar Rama Rao Patel: గ్రామాల అభివృద్ధికి కృషి

సిరా న్యూస్, లోకేశ్వ‌రం
గ్రామాల అభివృద్ధికి కృషి
* ఎంఎల్ఏ పవార్ రామారావు పటేల్
* ప‌లు అభివృద్దికి ప‌నుల‌కు భూమి పూజ‌
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాన‌ని ఎంఎల్ఏ పవార్ రామారావు పటేల్ అన్నారు. నిర్మ‌ల్ జిల్లా లోకేశ్వరం మండలం ఫిప్రీ గ్రామంలో 7లక్షల నిధులతో చేప‌ట్టే డ్రైనేజ్ నిర్మాణానికి ఎంఎల్ఏ పవార్ రామారావు పటేల్ భూమి పూజ చేశారు. అనంతరం శివపార్వతులకళ్యాణోత్సవం , ఆలయ రెండవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నియోజక వర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కనీస అవసరాలైనా సిసి రోడ్లు,డ్రైనేజీ నిర్మాణం, తాగు నీరు , సాగునీరు, రహదారుల నిర్మాణం, తదితరాలు కల్పించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్య క్ర‌మంలో మండల సీనియర్ నేతలు,బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *