సిరా న్యూస్, నిర్మల్ (పెంబి):
ఎమ్మెల్యే వెడ్మా బొజ్జును సన్మానించిన పెంబి నాయకులు..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజక వర్గం పెంబి మండల కాంగ్రేస్ నాయకులు ఇటీవల ఎమ్మెల్యేగా గెలుపొందిన వెడ్మా బొజ్జు పటేల్ను ఘనంగా సన్మానించారు. గురువారం హైదరబాద్లో ఎమ్మెల్యేను కలిసి బొకే అందజేసారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఒక చిన్న స్థాయి నాయకుడి నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఎదిగిన వైనం అందరికి ఆదర్శమని అన్నారు. ఎమ్మెల్యేను సన్మానించిన వారిలో కాంగ్రేస్ పార్టి పెంబి మండల అధ్యక్షులు సల్ల స్వప్నిల్ రెడ్డి, ప్రముఖ్య న్యాయవాది సల్ల ప్రశాంత్ రెడ్డి, జవహార్ బాల మంచ్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు తులాల శంకర్, వార్డ్ సభ్యులు గుగ్గిళ్ల భూమేష్, భుక్యా సుభాష్, తదితరులు ఉన్నారు.