సిరా న్యూస్,సింహాచలం;
బుధవారం ఉదయం సింహాద్రి నాధుని పుష్కరిణిలో పోలిపాడ్యమి ఉత్సవం జరిగింది. తెల్లవారుజాము నుండి భక్తులతో పుష్కరిణి పోటెత్తింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా దేవస్థానం సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసారు. పుష్కరిణిలో అరటి డో ప్పలతో దీపాలను వొదిలి భక్తులు తమ కోర్కెలు తీర్చు కున్నారు. ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేసారు. వరహ పుష్కరిణి భక్తిశ్రద్ధలతో మారుమోగింది.