వైయస్సార్సీపి జిల్లా అనుబంధ విభాగాలలో తుగ్గలి మండల నాయకులకు పదవులు

సిరా న్యూస్,తుగ్గలి;
వైఎస్ఆర్సిపి జిల్లా అనుబంధ విభాగాలలో తుగ్గలి మండలానికి చెందిన నాయకులకు జిల్లా స్థాయిలో పదవులను కేటాయిస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులలో మండల కేంద్రమైన తుగ్గలి కు చెందిన మోహన్ రెడ్డి కు వైఎస్ఆర్సిపి జిల్లా కమిటీలో కార్యవర్గ సభ్యులతో పాటు వైకాపా సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా,కడమకుంట్ల గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి కు వైకాపా యూత్ జిల్లా ఉపాధ్యక్షులుగా,ఎర్రగుడి గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జిట్టా లక్ష్మీదేవి కు,రాంపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గంగాధర్ కు వైకాపా బిసి సెల్ జిల్లా కార్యదర్శులుగా,తుగ్గలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పురుషోత్తం కు వైకాపా ఎస్సీ సెల్ కార్యదర్శిగా,మాజీ జెడ్పిటిసి నారాయణ నాయక్ ఎస్టీ సెల్ వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా,బోడబండ తాండ కు చెందిన భీమా నాయక్ కు మరియు రోల్లపాడు తాండ కు చెందిన చిన్న కృష్ణా నాయక్ లకు ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శులుగా,వైకాపా క్రిస్టియన్స్ జిల్లా కార్యదర్శిగా పగిడిరాయి మాజీ సర్పంచ్ జనార్ధన్ ను,వైకాపా మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా రాంపురం సర్పంచ్ షేక్ లడ్డు కమల్ భాష ను, వైకాపా మైనార్టీ సెల్ జిల్లా సహాయ కార్యదర్శిగా రాంపురం కొట్టాల కు చెందిన హుస్సేన్ భాష ను,ప్రచార కమిటీ జిల్లా కార్యదర్శిగా పెండేకల్లు చెందిన రోషి రెడ్డిను, వైకాపా రైతు విభాగపు జిల్లా కార్యదర్శిగా ముక్కెళ్ల గ్రామానికి చెందిన లక్ష్మణ్ స్వామి లకు పదవులు కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా పదవులు పొందిన మండల వైసీపీ నాయకులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి జిల్లా స్థాయిలో పదవులు కేటాయించిన అధిష్టానానికి, ఎమ్మెల్యే శ్రీదేవి కు మరియు మండల వైసీపీ నాయకులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అధిష్టానం కేటాయించిన పదవులతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, పార్టీ అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలియజేశారు.వైసీపీ ప్రభుత్వం లోనే అన్ని వర్గాల అభివృద్ధి కొనసాగుతుందని వారు తెలియజేశారు.వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడే ఏర్పడే విధంగా తమ వంతు కృషి చేస్తామని వైసిపి నాయకులు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *