మారుమూల గ్రామంలో రచ్చబండ కార్యక్రమం…

ఎమ్మెల్యే ఎదుట మహిళ సమస్యల గళం
భద్రాద్రి కొత్తగూడెం;
చండ్రుగొండ మండలం మహమ్మద్ నగర్ అనే మారుమూల గ్రామంలో మీ ఊరు – మీ ఎమ్మెల్యే కార్యక్రమం పేరుతో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రచ్చబండ లో ఒక ముస్లిం మహిళ ఆధార్ కార్డ్ తప్పా తమకు ఏ గుర్తింపు లేదంటూ సమస్యల గళం ఎత్తడంతో చలించిపోయారు. ఏకంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఒక ముస్లిం మహిళ మాట్లాడుతూ… తమ గ్రామానికి విద్య, వైద్యం ఎంతటి అవసరమో ఆవేదనతో తెలిపారు. ఇల్లు, కరెంటు, డ్రైనేజ్ లను ఏర్పాటు చేయాలని కోరింది. తమ గ్రామం మారుమూల ప్రాంతంలో ఉందని తమకు రోడ్డుతో పాటు బస్సు సౌకర్యం కల్పించాలని కోరింది. పలు సమస్యలను ధైర్యంగా ఎమ్మెల్యే కు వివరించడంతో గ్రామస్థులు సదరు మహిళను కరథాల ధ్వనులతో అభినందించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహ్మద్ నగర్ గ్రామాన్ని దత్తత తీసుకుని ఒక మోడరన్ గ్రామంగా తీర్చిదిద్దానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వచ్చేనెల అక్టోబర్ 2వ తారీకు నుండి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక చేపడుతోంది ఈ కార్డ్ ద్వారా పలు సమస్యలు పరిస్కారం అవుతాయని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల ద్వారా ప్రజలు లబ్ధిచెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *