సిరాన్యూస్, బోథ్
సొనాల పాఠశాలకి సౌండ్ బాక్స్ అందజేత : దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ
భారతదేశ ప్రధానమంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ 74 వ జన్మదినాన్ని పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్, సోనాల రామాలయ కమిటీ చైర్మన్ జీవి రమణ జడ్పీఎస్ఎస్ సోనాల పాఠశాలకు సౌండ్ సిస్టమును విరాళముగా అందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జీవి రమణని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచం వ్యాప్తంగా భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానములో నిలిచిన భారత ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన జన్మదినం సందర్భంగా పాఠశాల కి సౌండ్ బాక్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది అని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.