సిరాన్యూస్, ఆదిలాబాద్
అధికారులు బాధ్యతతో పని చేయాలి
* జిల్లా పాలనాధికారి రాజర్షి షా
జిల్లాలో జరిగే పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యతతో పని చేయాలని, వారికి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు.బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆదిలాబాద్, బోథ్ , నిర్మల్, ముధోల్, ఖానాపూర్ , ఆసిఫాబాద్, సిర్పూర్ టి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనరల్ ఎలక్షన్ లోక్ సభ 2024 ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కో ఆర్డినేషన్ మీటింగ్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఏ ఆర్ ఓస్. ఎస్ డి పి ఓ.లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 2111 ఏర్పాటు చేయడం జరిగిందని, బ్యాలెట్ యూనిట్స్ 2638 కంట్రోల్ యూనిట్స్ 2638 వివి పాట్స్, 2908 మొబైల్ కనెక్టివిటీ 2039, షాడో పోలింగ్ కేంద్రాలు సిర్పూర్ 11 , ఆసిఫాబాద్ 28, ఖానాపూర్ 9, ఆదిలాబాద్ 9 , బోథ్ 14, నిర్మల్ 1 , ముదోల్ 0, మొత్తం 72. పోలింగ్ విధుల కోసం నియమించిన సిబ్బందికి వచ్చేనెల ఏప్రిల్ 3, 4 తేదీలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తో పాటు ఫామ్ 12 డి కౌంటర్ ఏర్పాటు చేయాలని , ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతీ ఒక్కరు ఫారం 12డి ఉపయోగించుకోవాలని ఆన్నారు. ఏఆర్ ఓ పోలింగ్ కు ముందే ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రతీది దగ్గరుండి పర్యవేక్షించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.కౌంటింగ్ కేంద్రాలలో సివిల్ వర్క్స్ ఏమైన ఉంటే కంప్లీట్ చేయాలని, స్ట్రాంగ్ రూమ్, టేబుల్స్, బందోబస్తు తదితర ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే సెక్టరల్ అధికారులకు టిం వైస్ గా శిక్షణ ఇవ్వాలని తెలిపారు.ఎంటర్ స్టేట్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఆరు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు రెండు అంతర్ జిల్లా చెక్ పోస్టుల ను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీ నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రజలలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఫ్లాగ్ మార్చలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరచడం జరుగుతుందని, ఎటువంటి సిగ్నల్ వ్యవస్థ లేనటువంటి షాడో పోలింగ్ స్టేషన్ ప్రాంతాలను గుర్తించి కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేసేలా విహెచ్ఎఫ్ సెట్లను ఉపయోగించాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్లో , స్ట్రాంగ్ రూములలో మూడంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల పోలీస్ సిబ్బందితో సమన్వయం కోసం ఇంటర్ స్టేట్ బోర్డింగ్ జిల్లాలతో మీటింగ్ లను నిర్వహించడం జరిగిందన్నారు. బార్డర్ లో ఉన్న పోలీస్ సిబ్బందితో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమాచార వ్యవస్థని పటిష్టం చేయడం జరిగిందని తెలిపారు.ఈ సమావేశం లో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఆసిఫాబాద్, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ట్రైనీ కలెక్టర్ వికాస్ మహతో, నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అదిలాబాద్,నిర్మల్, కోమరంభిం ఆసిఫాబాద్, పోలీస్ సిబ్బంది, ఆర్డీఓ లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.