Rajarshi Shah: కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలి : క‌లెక్ట‌ర్ రాజర్షి షా

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలి : క‌లెక్ట‌ర్ రాజర్షి షా
* పోషన్ అభియాన్ పై అధికారుల‌తో సమీక్షా

సంత్సరానికి ఒకసారి నిర్వహించే కుటుంబ సర్వే లో అన్ని వివరాలతో పకడ్బందీగా చేపట్టాలని, బాలమృతమ్ , కోడిగుడ్లు అందిస్తున్న వివరాలు టీహెచ్ఆర్‌లో అప్ డేట్ చేయాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పోషన్ అభియాన్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ, సూపర్ వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ల ద్వారా కుటుంబ సర్వే, రిజిష్టర్ లు మెయింటెన్ , బరువు తక్కువగా ఉన్న పిల్లలను రిమ్స్, ఉట్నూర్ సీహెచ్‌సీలోని ఎన్ ఆర్‌సీ ఎస్ఎన్‌సీయూ రిఫర్ , ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త లు, అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్న బియ్యం బయోమెట్రిక్ , గ్రోత్ మానటరింగ్, అప్డేట్ తదితర అంశాలపై సీడీపీఓ , సూపర్వైజర్లను మండలాల వారిగా వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేస్తున్న బియ్యం నకు సంబందించిన బయోమెట్రిక్ వేసిన తర్వాత వారం లోగా ఏజెన్సీ వారు కేంద్రాలకు సరఫరా కావాలని ఆదేశించారు. సంత్సరానికి ఒకసారి నిర్వహించే కుటుంబ సర్వే లో ఆన్ని వివరాలతో పకడ్బందీగా చేపట్టాలన్నారు.కార్యక్రమం లో ట్రైనీ కలెక్టర్ వికాస్ మహతో, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *