డిసెంబర్ 20 వరకు నీటిని వదలండి

సిరా న్యూస్;కౌతాళం;
తుంగభద్ర డ్యామ్ బోర్డు పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,53,000 (లక్షా యాభై మూడు వేల ఎకరాలు) సాగుభూమి ఉన్నది. వీటికి తుంగభద్ర కాలువ సరే ప్రధాన వరకు తుంగభద్ర కాలువ క్రింద సాగుభూమిలో మిరప మరియు వత్తిపంటలు ఎక్కువగా పండిస్తున్నారు. ఈ సంవత్స రం బోడ్డు మీటింగులో కాలువలకు నవంబర్ 30వ తారీఖు దాకా నీరు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. నవంబర్ నెలలో డ్యామ్ పరివాహక ప్రాంతములో వర్యాలు రావడం వల్ల అవంగా 4 టి.యం.సి.ల నీరు రిజర్యాయం లో వచ్చి చేరింది. దీనివల్ల రైతు లకు ఇంకొన్ని రోజులు నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. కావున మొదట నిర్ణయించిన దాని ప్రభు నవంబర్ 30వ తారీఖు దాకా కాకుండా డిసెంబర్ 20వ తాజా నీటిని విడుదలచేయాలి. దీని వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఈ సంవత్సరము వర్యాలు కూడా లేని కారణంగా రైతులు ఇప్పటికే చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. కావున డిసెంబర్ 20న వరకూ నీళ్లు ఇవ్వ డం ద్వారా రైతులకు ఎంతోములు జరిగి వారిని కాపాడినవారవుతారు. కాలువకు 650 క్యూసెక్కులు అ.పి.సరిహద్దులో తగ్గకుండా చూసి మరియు నీటి చౌర్యం కాకుండా సి.ఆర్.పి.యఫ్ బలగాలను తేప్పించి నీటికి కాపాలాగా ఉంచాలని సాయిబాబా  అభ్యర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *