సిరా న్యూస్, రాజన్న సిరిసిల్ల:
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం..
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను దశల వారీగా నెరవేరుస్తామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ విప్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆదివారం మొట్ట మొదటి సారి వేములవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్ ఘన స్వాగతం ఏర్పాటు చేసారు. మహిళలు మంగళ హారతులతో నీరాజనం పలికారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ ఆయన పాల్గొని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రేస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ అరాచకాలకు చరమగీతం పాడి, కాంగ్రేస్కు పట్టం కట్టిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. అంతకు ముందు పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానలు, తదితరులు పాల్గొన్నారు.