సిరా న్యూస్, జైనథ్
జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించిన గాజుల సౌజన్య
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మండగడ గ్రామానికి చెందిన గాజుల సౌజన్య డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటింది. ఎస్టీజీ జిల్లా స్థాయిలో 8 వ ర్యాంకు సాధించింది. ఈ సందర్బంగా గ్రామస్తులు మంగళవారం సౌజన్య దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండగడ గ్రామస్తులు సైపట్ మహేందర్ రావ్ , మామిడి మల్లా రెడ్డి, ప్రభాకర్, విట్టల్, శ్రీనివాస్ ఆశన్న తదితరులు పాల్గొన్నారు.