Teacher Gajula Soujanya : జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించిన గాజుల సౌజన్య

సిరా న్యూస్, జైన‌థ్‌
జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించిన గాజుల సౌజన్య

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మండగడ గ్రామానికి చెందిన గాజుల సౌజన్య డీఎస్సీ ఫలితాల్లో స‌త్తా చాటింది. ఎస్టీజీ జిల్లా స్థాయిలో 8 వ ర్యాంకు సాధించింది. ఈ సందర్బంగా గ్రామస్తులు మంగ‌ళ‌వారం సౌజన్య దంపతులను ఘనంగా స‌న్మానించారు. కార్య‌క్ర‌మంలో మండగడ గ్రామస్తులు సైపట్ మహేందర్ రావ్ , మామిడి మల్లా రెడ్డి, ప్రభాకర్, విట్టల్, శ్రీనివాస్ ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *