సిరాన్యూస్, జైనథ్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గడ్డం వెంకట స్వామి: తహసీల్దార్ శ్యాంసుందర్
* జైనథ్లో తహసీల్దార్ కార్యాలయంలో గడ్డం వెంకట స్వామి జయంతి
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గడ్డం వెంకట స్వామి అని తహసీల్దార్ శ్యాంసుందర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో గడ్డం వెంకట స్వామి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ శ్యాం సుందర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ ఉద్యమంలో క్రియాశీలక నేత వెంకట స్వామి అని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గడ్డం వెంకట స్వామి అన్నారు.నిరంతరం పేదల బతుకుల్లో వెలుగు నింపడానికి కృషి చేసిన యోధుడు అని కొనియాడారు. అనేక కార్మిక సంఘాలకు నాయకత్వం వహించినవాడని తెలిపారు. అంచెలంచెలుగా కేంద్రం మంత్రిగా ఎదిగారని, హైదరాబాద్ లోని నిరుపేదల పక్షాన భూ పోరాటం చేసి వారికి ఇంటి స్థలం పట్టాలు ఇప్పించారని తెలిపారు. సింగరేణి కార్మికులకు ఐ.టి మాఫీ చేయించిన మహానేత అన్నారు. ప్రాణ హిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతోనే పోరాడిన నాయకుడని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి, ఆర్ ఐ ఉల్లాస్, జూనియర్ అసిస్టెంట్ దేవన్న రికార్డు అసిస్టెంట్ నందు, వీఆర్ఏ రాఘవ పాల్గొన్నారు.