విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట – అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై అఖిలపక్ష నాయకులు తీవ్రంగా స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.